News

కిషన్‌రెడ్డి ఆంధ్రా చేతిలో కీలుబొమ్మ:హరీశ్‌


సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆంధ్రా చేతిలో కీలుబొమ్మగా మారారని  విమర్శించారు. తెలంగాణలోని ఆరు మండలాలను ఆంధ్రాలో కలిపితే కిషన్‌రెడ్డి ఏంచేశారన్నారు. బీజేపీ నాయకులు ధర్నాలు  తెలంగాణలో కాకుండా మోడీ దగ్గర చేయాలని అన్నారు. చంద్రబాబు మోసాలపై కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధిని చూడలేక అసత్యపు ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హరీష్ రావు అన్నారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ కోసం మోడీని ఒప్పించాలన్నారు.