News

ర్యాగింగ్‌కు ఫల్పడితే సస్పెండ్ చేస్తాం:ఘంటా


ఆంధ్రప్రదేష్‌ని ర్యాగింగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గంటా శ్రీనివాస్‌రావు చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని భవిష్యత్‌లో ఎక్కడా చదువుకోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్వీయూలో ర్యాగింగ్‌కు పాల్పడ్డ ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన గంటా శ్రీనివాస్‌రావు స్వామి దర్శనం చేసుకున్నారు.