News

పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రత్తిపాటి స్పందించారు


ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు పవన్ కళ్యాణ్‌ ఎంతో కృషి చేశారని మంత్రి అన్నారు. రాజధాని భూముల వ్యవహారంపై పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు.  మంత్రులెవరూ పవన్‌ను ఉద్దేశించి వెటకారంగా మాట్లాడలేదని ఆయన అన్నారు. రెండూ వేల రెండు వందలు ఎకరాల భూసేకరణకుగాను తొలిదశలో తుళ్లూరు మండలంలో ఏడు వందల ఎకరాల రైతులకు నోటీసులిస్తామని తెలిపారు. చంద్రబాబుకు, పవన్‌కళ్యాణ్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.  పవన్‌తో మాట్లాడేందుకు భేషజాలు లేవని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు భూముల వ్యవహారంపై లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు.