News

జగన్‌ ఓర్వలేకపోతున్నారు:మంత్రి దేవినేని


రిజర్వాయర్ నిర్మాణ పనులల్లో జరుగుతున్న జాప్యంపై  అధికారుల మీద మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావ్ మండిపడ్డారు. గొల్లపల్లి రిజర్వాయర్ పనులను  పరిశీలించారు.  అనంతరం వీలైనంత త్వరగా పనులు పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌ ద్వారా రాయసీమకు నీళ్లు తెస్తుంటే జగన్‌ ఓర్వలేకపోతున్నారని దేవినేని తెలిపారు. ఎప్పటికైనా జగన్‌ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోవడం ఖచ్చితమని దేవినేని ఉమా అన్నారు.