News

కెసిఆర్‌పై జానారెడ్డి విమర్శలు చేశారు


ఇందిరమ్మ ఇళ్ల పధకంలో అవకతవకల పేరుతో బకాయిలు చెల్లించకుండా, ఇళ్లు నిర్మించకుండా ప్రభుత్వం చేస్తున్న తీరు ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వస్తున్నదని సిఎం కెసిఆర్ పై విపక్ష నేత జానారెడ్డి విమర్శలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు ఉంటే ఏ పార్టీ వారైనా చర్యలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. కాని ఆ పేరుతో పేదల ఇళ్ల బిల్లులు పెండింగులో ఉండడం ప్రభుత్వానికి తగదని అన్నారు.నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కూడా చెప్పేదానికి,జరుగుతున్నదానికి పొసగడం లేదని అన్నారు.ప్రజలలో ప్రభుత్వంపై అసంతృప్తి వస్తోందన్న సంగతి గమనించాలని అన్నారు. ప్రభుత్వాన్ని క్యాంప్ ఆఫీస్ నుంచి కాకుండా సచివాలయం నుంచి నడపాలని ఆయన సూచించారు.