News

హైదరాబాద్‌లో బోనాలకు గట్టి భద్రత


హైదరాబాద్ పాతబస్తీలోని అక్కన్న మాదన్న దేవాలయం సహా అన్ని ప్రాంతాల్లో ఆదివారం జరిగే బోనాల ఉత్సవాలకు నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లాల్‌దర్వాజాలో మూడువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం రంగం సందర్భంగా అంబారీ ఊరేగింపునకు చర్యలు తీసుకున్నారు. ఊరేగింపులు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా రేపు, ఎల్లుండి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. అమ్మవారి దర్శించుకునేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.