News

 జగన్ మరోసారి జిల్లాలో పర్యటించబోతున్నారు


శాసనసభలో విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ మరోసారి అనంతపురం జిల్లాలో పర్యటించబోతున్నారు.రైతు భరోసా యాత్ర పేరుతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించి, తమ పార్టీ పరంగా సాయం చేస్తారు. ఈ నెల ఇరవైనాలుగో తేదీన ఎఐసిసి ఉపాద్యక్షుడు రాహుల్ గాందీ అనంతపురం జిల్లాలో పర్యటించబోవడానికి ముందుగానే జగన్ అక్కడకు ఈ నెల ఇరవైఒక్కటిన వెళతారు.మూడు శాసనసభ నియోజకవర్గాలలో ఆయన యాత్ర కొనసాగిస్తారు.అనంతపురం జిల్లాలో గత ఎన్నికలలో పార్టీ అనూహ్యంగా దెబ్బ తిన్న నేపధ్యంలో జగన్ ఆ జిల్లాపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికి రెండుసార్లు వెళ్లిన జగన్ తాజాగా మూడోసారి భరోసా యాత్రకు వెళుతున్నారు.