News

పాలమూరును ఏ శక్తీ ఆపలేదు


ఏ శక్తీ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడం కోసం కేంద్ర జలవనరుల సంఘానికి లేఖ రాయడం ద్రోహమని విమర్శించారు. పాలమూరు ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధిస్తాం అని హరీశ్ రావు స్పష్టం చేశారు.