News

నేడు రాష్ట్రపతితో ఏపీ మంత్రుల బృందం భేటీ


ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమల్లో తెలంగాణ ప్రభుత్వంతో ఎదురవుతున్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం ఈరోజు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో సెక్షన్8 సమగ్ర అమలు, 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నేతృత్వంలోని మంత్రుల బృందం దీనిపై రాష్ట్రపతికి లిఖిత పూర్వకంగా నివేదిక ఇవ్వనుంది. దీంతో పాటు గోదావరి పుష్కరాలకు రాష్ట్రపతిని ఆహ్వానించనున్నారు