News

జగన్ బెయిల్ రద్దు చేయాలి : వర్ల రామయ్య


ఎపి శాసనసభలో విపక్షనేత జగన్,ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ల బెయిల్ రద్దు చేయాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. దాల్మియా ద్వారా వచ్చిన నిదుల విషయాన్ని సిబిఐ డీకోడ్ చేసి ఆదారాలు చూపించిందని ,కోర్టుకు సమర్పించిందని టిడిపి ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు.3500 టన్నుల సిమెంట్ అంటే డబ్బు అని వెల్లడైందని, దీని బట్టి ఎన్ని టన్నుల డబ్బు వసూలు చేశారో చెప్పాలని ఆయన అన్నారు.ప్రజాధనం కొల్లగొట్టడంలో జగన్ ,విజయసాయిరెడ్డిలు కొత్త పద్దతులు కనిపెట్టారని ఆయన ఆరోపించారు. వెంటనే వారి బెయిల్ రద్దు చేసి తిరిగి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు