News

గాంధీభవన్ లో మాజీ పిసిసిల ఫోటోల తొలగింపు


పార్టీ మారిన పిసిసి అధ్యక్షుల పోటోలను గాంధీభవన్ లో తొలగించారు. ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన డి.శ్రీనివాస్, గతంలో పార్టీ మారిన ఎంపీ కే.కేశవరావు, వైసిపిలో చేరిన బొత్స సత్యనారాయణ చిత్రాలను తొలగించారు. గాంధీ భవన్ కు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ వి.హన్మంతరావు, పార్టీ సీనియర్ నేత దామోదర్ రెడ్డిలు పొటోలను తొలగించి చెత్తబుట్టలో పాడేశారు. పార్టీ మారిన వారి చిత్రాలు గాంధీభవన్ లో ఉండటం మంచిది కాదని, వారంతా తమ స్వలాభం కోసం పార్టీ మారారని విహెచ్, దామోదర్ రెడ్డి వ్యాఖ్యానించారు.