News

సెక్షన్‌ 8... చిక్కు ముళ్లు విప్పేదెలా


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హస్తినబాట పట్టారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శితోపాటు సంబంధిత శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై చర్చించ నున్నారు. ప్రధానంగా సెక్షన్‌ 8పైనే చర్చ జరుగనున్నట్టు సమాచారం