News
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
ఓ వైపు రాష్ట్రంలో రైతులు కరువుతో అల్లాడుతుంటే తమిళనాడు ప్రభుత్వం ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు భారీగా పెంచింది. జీతాలను సుమారు 100 శాతం పెంచుకుని శాసనసభ్యులు తమకు తాము బహుబతి ఇచ్చుకున్నారు. ప్రస్తుతం రూ. 55వేలుగా ఉన్న ఎమ్మెల్యే జీతాన్ని రూ. 1.05 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి నిధులను కూడా రూ. 2 కోట్ల నుంచి రూ. 2.5 కోట్లకు పెంచుతున్నట్లు సీఎం వెల్లడించారు. ఎమ్మెల్యేల పింఛను కూడా రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెరిగింది. జీతాల పెంపును అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారు. అయితే రుణాలు మాఫీ చేయాలని, కరువు భృతి ఇప్పించాలని నెలల తరబడి నిరసనలు ప్రదర్శనలు, ఆందోళనలు చేసిన రైతులను పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్యేల జీతాలను ఎలా పెంచుతుందని విమర్శకులు అంటున్నారు. మరోవైపు రైతులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమను నిర్లక్ష్యం చేస్తూ ఎమ్మెల్యేల జీతాలు పెంచడం బాధాకరమని ఆవేదన చెందుతున్నారు. నేతలకు చిత్తశుద్ధిలేదని, రైతులపై శ్రద్ధలేదని ఆరోపిస్తున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








