News

సెల్‌ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు


డ్రగ్స్‌ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలోని ఐదో అంతస్థులో విచారణ జరుగుతోంది. ఎక్సైజ్ కార్యాలయానికి పూరీతో పాటు ఆయన సోదరుడు సాయిరాం శంకర్, కుమారుడు ఆకాష్ పూరీ కూడా వచ్చారు. ఈ సందర్భంగా పూరీ సోదరుడు సాయిరాం శంకర్ నానా హంగామా సృష్టించాడు. పలువురి రిపోర్టర్ల సెల్‌ఫోన్లు లాక్కుని, వాటిలోని వీడియోలను డిలీజ్ చేశాడు. రహస్యంగా జరుగుతున్న విచారణ గురించి అందరికీ ఎందుకు తెలియజేస్తారంటూ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.