News

కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్


మంత్రి కెటిఆర్ కు ,తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మద్య మాటల యుద్దం సాగుతోంది. కెటిఆర్ తన పేరును గాలిరావు గా మార్చుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. కెసిఆర్ కుటుంబం దేశం కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబంతో పోల్చుకోవడం సిగ్గు చేటని ఆయన అన్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు, మాయమాటలు, మోసాలు, గాలిమాటలు తప్ప నిజాలు, త్యాగాలు కేసీఆర్‌ కుటుంబానికి తెలియవని ఆయన విమర్శించారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి, పార్టీకి మెజారిటీ రాగానే సీఎం కుర్చీలో కేసీఆర్‌ కూర్చున్నారని దుయ్యబట్టారు. పార్టీకి అధికారం వచ్చినా ప్రధాని పదవిని త్యాగం చేసిన చరిత్ర సోనియాగాంధీదన్నారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని, ఆ వాస్తవాన్ని కేటీఆర్‌ గుర్తుంచుకోవాలని షబ్బీర్ వ్యాఖ్యానించారు.