News

రేవంత్‌ రెడ్డిపై నమస్తే తెలంగాణ మరో బాంబు


నోటుకు ఓటు కేసులో కటకటాల పాలైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిపై నమస్తే తెలంగాణ దినపత్రిక మరో బాంబు వేసింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పత్రికగా భావించే నమస్తే తెలంగాణ దినపత్రిక రేవంత్ రెడ్డి అక్రమాలపై సోమవారం ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది. పాపాల భైరవుడు అనే శీర్షిక కింద ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది. నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రకారం - హైదరాబాద్ మహా నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతం జూబ్లీహిల్స్‌లోని కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో సభ్యుడిగా అక్రమాలకు పాల్పడ్డాడు. కాంగ్రెస్ సీనియర్ నేత బంధువు కూతురిని వివాహం చేసుకొని ఆ కోణంలో పైరవీ చేసుకొని రేవంత్‌రెడ్డి 2000 సంవత్సరంలో ఈ సొసైటీలో సభ్యుడిగా స్థానం సంపాదించుకున్నాడు. రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తాడు. అందుకు జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ (జేహెచ్‌సీహెచ్‌బీఎస్)లో చోటుచేసుకున్న భారీ అక్రమం దోహదపడింది.