News

కేసీఆర్‌ మద్దతు ఇస్తే వాళ్లకి అన్యాయమే


టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి కేసీఆర్‌ మద్దతు ఇవ్వడం మైనార్టీలకు అన్యాయం చేయడమే అని విమర్శించారు. గురువారం ఆయన కోదాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఇస్లాం, క్రైస్తవ మతాల వారు భారత దేశానికి చెందినవారు కాదన్న వ్యక్తిని రాష్ట్రపతిగా ఎన్నుకోవడం శోచనీయం అన్నారు. జిఎస్టీ, రాష్ట్రపతి ఎన్నిక పట్ల కెసిఆర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమాన పరిచినట్లే అని తెలిపారు. తెలంగాణ ఎర్పాటుకు కృషి చేసిన మీరాకుమార్ కి  కాంగ్రేస్ పార్టీ తరుపున తాము ఓటు వేస్తామన్నారు.