News

నెంబర్‌1 స్థానం చంద్రబాబుకే : రోజా


అవినీతిలో ఎపిని నెంబర్‌1 స్థానంలో నిలబెట్టిన ఘనత సిఎం చంద్రబాబుకే దక్కిందని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.. హుదహుద్‌ సమయంలో సాయం పేరుతో రికార్డులను గల్లంతు చేశారని విమర్శించారు.. సిట్‌ అనేది కోరల్లేని పాము లాంటిదని అభివర్ణించారు.. సిబిఐ విచారణ అంటూ మంత్రి గంటా లేఖ రాయటం కొత్తడ్రామా అని అన్నారు.. భూకబ్జాలవల్లే లోకేష్‌ ఆస్తులు పెరిగాయని ఆమె విమర్శించారు.