News

డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకానికి అర్హులు ఎలా తగ్గారు


డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకానికి అర్హులు ఎలా తగ్గారని ప్రభుత్వాన్ని టీడీఎల్పీ నేత రేవంతరెడ్డి ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేలో 22 లక్షల మంది పేదలున్నట్లు గుర్తించిన ప్రభుత్వం డబు ల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు 51,954 మందినే అర్హులు గా తేల్చడమేంటన్నారు. 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన వివరాల లేఖను రేవంత విలేకరులకు చూపించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కటిస్తామంటూ లక్షలాది పేదలను ఎందుకు మభ్య పెడుతున్నారని ప్రశ్నించారు. కాగా, గృహ నిర్మాణ శాఖలో తాత్కాలిక ఉద్యోగులను తొలగించారని, రెగ్యులర్‌ ఉద్యోగులు, అధికారులను ఇతర శాఖలకు బదిలీ చేశారని, ఇక ఆ శాఖకు మంత్రెందుకని ఎమ్మెల్యే సండ్ర ఎద్దేవా చేశారు.