News

14 విమానాలు రద్దు


శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 14 విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. శంషాబాద్‌ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన 7 విమానాలు, శంషాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన నాలుగు విమానాలు, జయపుర, విజయవాడ, రాజమహేంద్రవరం వెళ్లాల్సిన ఒక్కో విమానం రద్దు చేసినట్లు వెల్లడించారు. కొద్ది సేపటి క్రితం చెన్నై విమానాశ్రయం నుంచి జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు పునరుద్ధరించారు.