News

ప్రతిపక్షం బుద్ధి తెచ్చుకోవాలి


ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఓటుకు నోటు కేసులో హైకోర్టు తీర్పు విపక్షాలకు చెంపపెట్టు అని అన్నారు. ఈ కేసులో చంద్రబాబుకు సంబంధం లేదని ముందు నుంచీ చెబుతున్నామని ఇకనైనా ప్రతిపక్షం బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్‌ కల నెరవేరదని యనమల స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును విచారించాల్సిన అవసరం లేదన్న ఆయన న్యాయవాది వాదనతో ఏకీభవిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.