News

రూ.2000 వరకు ఉంటే సేవా పన్ను రద్దు


నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు ప్రకటించింది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులను ఉపయోగించి లావాదేవీలను జరిపినపుడు, ఆ లావాదేవీ విలువ రూ.2000 వరకు ఉంటే, దానిపై సేవా పన్నును రద్దు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెడతారు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడంతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు.  ఆన్‌లైన్ లావాదేవీలకు వీలు కల్పించేందుకు బ్యాంకులు కూడా ప్రత్యేకంగా యాప్‌లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.