News

‘మేమేమైనా చిన్న పిల్లలమా?


అంద్రప్రదెశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై మంత్రుల్లో తీవ్రఅసహనం వ్యక్తమవుతోంది.వార్షిక పరీక్షలు,పనితీరు మదింపు చేస్తామనడంపై ‘మేమేమైనా చిన్న పిల్లలమా?’అంటూ సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా మంత్రులందరూ వాపోతున్నారు. మంత్రులు ఏడాది పనితీరుపై స్వీయ నివేదికలను రూపొందించి ముఖ్యమంత్రి ఓఎస్డీ అభీష్టకు పంపించాలనడంపైనా వారు మండిపడుతున్నారు. అభీష్టకు స్వీయ నివేదికలను పంపిస్తే, ఆయనతోపాటు విశ్రాంత ఐఏఎస్ అధికారి పరిశీలించి నివేదిక రూపొందిస్తారా? వాటి ఆధారంగా లోకేష్ మార్కులు వేస్తారా? ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా జరిగిందా? అని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.