News

హెచ్‌సీయూలో విద్యార్థుల ఆందోళన


గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లోని పరిపాలనా భవనం ఎదుట విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. శుక్రవారం వర్సిటీలో పరిశోధనా విద్యార్థి అబ్రహం ఆత్మహత్యాయత్నానికి కారకుడైన గైడ్‌ వైజీశ్వరన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. మచిలీపట్నానికి చెందిన అబ్రహంకు సరైన్‌ గైడెన్స్‌ ఇవ్వకుండా పలు విధాలుగా మానసికంగా ఒత్తిడిచేయడంతోనే అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అబ్రహం ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా గమనించిన తోటి విద్యార్థులు అతడ్ని సమీపంలోని ఆశా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అబ్రహం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.