News

ఎస్‌బీఐపై మండిపడ్డ కేజ్రీవాల్


ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 63 మంది ఎగవేతదారుల రుణాలు రద్దు చేస్తూ ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు. మోదీ ప్రభుత్వ నిర్ణయాలతో పెద్దలే లబ్ధిపొందుతున్నారన్నారు. పేదలు డబ్బు కోసం క్యూలో నిలబడి ఇబ్బంది పడుతుంటే పెద్దలకు లబ్ధి చేకూర్చేలా మోదీ ప్రయత్నిస్తున్నారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. దాదాపు రూ.7,106 కోట్ల మొండి బకాయిలు రద్దు చేస్తున్నట్లు ఎస్‌బీఐ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. విజయ్‌ మాల్యాకు చెందిన రూ.1200 కోట్ల బకాయిలను సైతం రద్దు చేసింది. బకాయిల రద్దు చేసిన వారిలో ఏపీ, తెలంగాణకు చెందిన వ్యాపారవేత్తలు ఉన్నారు.