News
కేసీఆర్ ఆదేశిస్తే రాజీనామే
సీఎం కేసీఆర్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్దం అని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ అన్నారు. సరస్సులో పువ్వాడ అజయ్ ఆక్రమించిన భూమిని ప్రభుత్వం క్రమబద్దీకరించిందని సుధాకర్రావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు ఖమ్మం జిల్లాలో 2.5 ఎకరాల భూమిలో చేపట్టిన వైద్య కళాశాల నిర్మాణాన్ని ఆపాలని, మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, రూ. 2.10 కోట్లు చెల్లించి మమతా కాలేజీ పక్కన స్థలాన్ని జీవో 59 ప్రకారం క్రమబద్దీకరించుకున్నామని తెలిపారు. తమ కాలేజీ ఆవరణలో ఎలాంటి సరస్సులు లేవని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








