News

దేశానికి ఎపి ఆదర్శం


ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీలో చేసిన ప్రసంగం ఆసక్తికరంగా ఉంది. దేశానికి ఎపి ఆదర్శమని, ఎపిని దేశం అనుసరిస్తుందని ఆయన చెప్పారు. ఈ రోజు ఎపిలో జరిగినదానిని రేపు దేశం అనుసరిస్తుందని ఆయన చెప్పారు.సాంకేతిక రంగంలో ఎపి దేశానికి మార్గదర్శకంగా ఉంటుందని చంద్రబాబు చెప్పారు. ఆలోచనలను అమలు చేయడంలో తనను మించినవారు లేరని ఆయన అన్నారు. ఐటీ-ఐవోటీలు, వినూత్న ఆలోచనలు, నూతన ఆవిష్కరణలతో ఏపీలో మరో సిలికాన వ్యాలీని సృష్టిస్తామని చంద్రబాబు తెలిపారు. 50 ఏళ్ల క్రితం సింగపూర్‌ కేవలం ఒక చేపలు పట్టే గ్రామమని, దుబాయ్‌లో 55 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, కానీ సాంకేతికత సాయంతో అవి తిరుగులేని శక్తిగా ఎదిగాయని చంద్రబాబు అన్నారు.