News

టీఆర్ఎస్‌పై మండిపడ్డ రాజగోపాలరెడ్డి


ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తమపై టిఆర్ఎస్ ప్రభుత్వం దుస్ఫ్రచారం చేస్తోందని అన్నారు. నల్లగొండ లో పొలిటికల్ బ్రదర్స్ అంటూ కోమటిరెడ్డి సోదరులపై టిఆర్ఎస్ కు చెందిన మీడియాలో పరోక్షంగా కధనాలు వచ్చాయి. నయీం వ్యవహారంలో వీరికి సంబందాలు ఉన్నాయన్న అనుమానాలు ఈ కదనాలలో పేర్కొన్నారు. దీనిపై కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని ఆయన అన్నారు. తానే ముందుగా నయీం కేసులో సంబందాలు ఉన్నవారిపై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశానని ఆయన గుర్తు చేశారు.ఇప్పుడు తమపై రివర్స్ లో ప్రచారం మొదలు పెట్టారని అన్నారు.తాము టిఆర్ఎస్ పై పోరాటం చేస్తున్నందున ముఖ్యమంత్రి కెసిఆర్ కావాలని ఈ ప్రచారం ఆరంబించారని ఆయన అన్నారు.