News

అప్పటి వరకు నేను అనాథనే


ముద్రగడ పద్మనాభం నేను అనాథను. కాపులను బీసీల జాబితాలో చేర్చే వరకు నేను అనాథనే అనుకుంటానని కన్నీళ్లు పెట్టుకున్నారు. కన్నీళ్లను తమాయించుకుని ఆయన మాట్లాడారు. మోరంపూడిలో ఆదివారం జరిగిన కాపు జేఏసీ సమావేశం చివరిలో ఆయన మాట్లాడారు. తాను ఆమరణ నిరాహారదీక్ష చేసినప్పుడు లోకేష్‌ ఆదేశాలతో పోలీసులు నన్ను, నా భార్యను పిల్లలను కొట్టారు. తీవ్రంగా వేధించారు. నేను మానసికంగా బాధపడ్డాను. ఈ బతుకెందుకని భావించానని కంటతడి పెట్టుకున్నారు. ఎన్ని బాధలుపడ్డా ఈ జాతికి మేలు చేయాలని ముందుకు వచ్చాను. కొందరు కేసులకు భయపడుతున్నారు. భయపడేవారు ఉద్యమాలకు రావద్దు. రిజర్వేషన్లు సాధించేవరకు ఉద్యమం ఆగదని అన్నారు.