News

ఉత్తమ్‌రెడ్డి , భట్టి విక్రమార్కలకు అభినందనలు.


తెలంగాణలో కాంగ్రెస్‌ బలోపేతంపై టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క దృష్టి సారించారు. ఈ మేరకు గాంధీభవన్‌లో సోమవారం వారిద్దరూ సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌, భట్టి విక్రమార్కలను.. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభినందించారు. కొత్త పదవుల్లో ఉత్తమ్‌, భట్టి విజయం సాధించాలని ఆకాంక్షించారు.