News

సెంట్రల్‌ బ్యాంక్‌లో మంగళవారం రాత్రి చోరీ


పటాన్‌చెరులో సెంట్రల్‌ బ్యాంక్‌లో భారీ చోరీ మంగళవారం రాత్రి విధులు ముగిశాక బ్యాంక్ సిబ్బంది తాళాలు వేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం బ్యాంకు లాకర్ తెరిచి చూసిన సిబ్బంది అవాక్కయ్యారు. లాకర్‌లో ఉన్న సొమ్ము కనిపించకపోవడమే ఇందుకు కారణం. దొంగిలించిన నగదు విలువ రూ. 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు తెలిపారు. బ్యాంక్‌ సిబ్బందిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.