News

సింగపూర్‌ దేశ పర్యటనలో సీఎం


సీఎం చంద్రబాబునాయుడు సింగపూర్‌ దేశ పర్యటనలో బిజీగా ఉన్నారు. సింగపూర్‌లోని కన్సార్టియంతో సైన్స్‌పార్కులో వాణిజ్య సమావేశంలో చంద్రబాబు బృందం పాల్గొంటుంది. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో చంద్రబాబు బృందం విందు భేటీలో పాల్గొని అమరావతి నగర అభివృద్ధి, స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిపై చర్చించనున్నారు. ఈ రోజు సాయంత్రం సౌత్‌ ఏసియన్‌ స్టడీస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చంద్రబాబు కీలక ఉపన్యాసం చేయనున్నారు. సింగపూర్‌ కన్సార్టియం ఇచ్చే విందులో చంద్రబాబు పాల్గొంటారు.ఈ కార్యక్రమంలో సంధానకర్తగా భారత రాయబారి గోపీనాథ్‌ పిళ్లై వ్యవహరిస్తున్నారు.