News

కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు:లక్ష్మణ్‌


బీజేపీ నాయకుడు లక్ష్మణ్‌ తెలంగాణ చరిత్రను సీఎం కేసీఆర్‌ వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. నిజాంను పొగుడుతూ తెలంగాణ అమరవీరులను కేసీఆర్‌ అవమానిస్తున్నారని చెప్పారు. నిజాం చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చడం తెలంగాణాకు ద్రోహం చేయడమేనన్నారు. త్వరలోనే కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని లక్ష్మణ్‌ అన్నారు. కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారన్నారు.